లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్కు అస్వస్థత
- ఆసుపత్రిలో చికిత్స... డిశ్చార్జి
- విజయవాడలోని లోక్ భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా పరామర్శ
- గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
- గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. విజయవాడలోని లోక్ భవన్లో గవర్నర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవలే స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన గవర్నర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు.
ఈ సందర్భంగా గవర్నర్ను పరామర్శించిన చంద్రబాబు, ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, విధులకు హాజరు కావాలని ఆకాంక్షించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన గవర్నర్, చికిత్స అనంతరం కోలుకుని లోక్ భవన్కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక పరామర్శ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా గవర్నర్ను పరామర్శించిన చంద్రబాబు, ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, విధులకు హాజరు కావాలని ఆకాంక్షించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన గవర్నర్, చికిత్స అనంతరం కోలుకుని లోక్ భవన్కు తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక పరామర్శ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి.